నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. 36,747 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకున్నారని తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు వచ్చేనెల ఐదో తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు. బుధవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చేనెల ఎనిమిదో తేదీ వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు గడువుందని వివరించారు. వివరాల కోసం షషష.://్రవaఎషవ్.అఱష.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.