టౌన్ 6 పి.యస్ పరిధిలో కమ్యూనిటి కాన్ టాక్టు ప్రోగ్రామ్ నిర్వహించిన కమీషనర్

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని శుక్రవారం ( తేది 22-09-2023 న ఉదయం 4:00 గంటల నుండి 8:00 గంటల) వరకు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని టౌన్ 6 పి.యస్ పరిధిలో రామ్ నగర్ – నెహ్రూనగర్ – సారంగపూర్ లో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, ఐ.పి.యస్. ఆధ్వర్యంలో  కమ్యూనిటి కాన్ టాక్టు ప్రోగ్రామ్ కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ 6 పి.యస్ పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్తగా దాదాపు 150 మంది పోలీస్ సిబ్బందితో ప్రతి వాహనాదారుల వాహనాల డాక్యూమెంట్లు ఉన్నాయ లేదా అని వారిని ఆరాతీయడం జరిగింది.ఈ సందర్భంగా ఎలాంటి కాగితాలు / నెంబర్పేట్లు లేని మొత్తం ద్విచక్ర వాహనాలు 82, ఆటోలు 31, కార్లు 2, లారీలు 2, స్వాదీనం చేసుకోవడం జరిగింది. మట్కా నిర్వాహాకులు అబ్దుల్ సాజీద్, సయ్యద్ షాదుల్లా లపై మట్కా కేసు నమోదు చేయడం జరిగింది. రెండు బెల్ట్ షాపులపై దాడి చేసి 248 లిక్కర్ బాటిల్స్ స్వాదీనం చేసుకొని వారిపై కేసులునమోదు చేయడం జరిగింది.ఒక లారీ మోరం తో గల దానిని సీజ్ చేసి తహసీల్దార్ వారికి తదుపరి చర్యకోసం పంపనైనది.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సత్యనారాయణ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు టౌన్ 6 లోని ప్రజలతో సత్సంబందాల కోసం ఈ కమ్యూనిటి కాన్ టాక్టు ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని, ప్రధానంగా వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్ ధరించాలని,
వాహానాల పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని, సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, సైబర్ నేరాలు చేసే వారి ఊచ్చులో పడకూడదని, ఎలాంటి పరిచయం లేని వారు ఆన్లైన్ ద్వారా మన సమాచారం అడిగినట్లయితే ఎవ్వరికి ఇవ్వరాదని, పిల్లలకు ఫోన్ లు ఇవ్వరాదని ,బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామనీ మన బ్యాంక్ సమాచారం అడిగిన ఎవ్వరికి ఇవ్వరాదని, లక్కీడ్రా పేరుతో ఎవ్వరికి డబ్బు లు ఇవ్వరాదని, ఎవ్వరూ కూడా ఆన్లైన్ ఫ్రాడింగ్ మోసాలకు గురికావద్దని, ఎవ్వరయిన మోసానికి గురి అవుతే వారు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని లేదా డయల్ 100 లేదా 1930 కు సంప్రదించాలని, ఎవ్వరు కూడా ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు కిరాయి ఇవ్వవద్దని, కొత్త వ్యక్తులకు ఇంటిని కిరాయికీ ఇచ్చేటప్పుడు వారి యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు వారి వారి పరిధిలో సి.సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకురావాలని, ఈ సి.సి కెమెరాల ఏర్పాటు వలన నేరగాళ్ల గుట్టురట్టులో ఎంతో దోహాదపడుతున్నాయని, సి.సి కెమెరాల వలన ఇప్పటి వరకు ఎన్నోదొంగతనాలకు పాలుపడిన నేరగాళ్లను కిడ్నాప్ కేసులో నిందితులను ఎంతోసులువుగాపట్టుకోవడం జరిగిందన్నారు. ఎవ్వరయిన తప్పుడు పనులు చేస్తున్నట్లు సమాచారం తెలిసిన వారు ముందుగా సంబంధిత పోలీస్ వారికి తెలియజేయాలని అటువంటి వారికి ముందస్తుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, వారు మారనట్లయితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఎవ్వరూ కూడా శాంతి భద్రతలకు ఎవరూ విఘాతము కలిగించరాదని అన్నారు. ఎవ్వరూ కూడా గంజాయి వాడకం చేయకూడదని, గంజాయికి సంబందించిన సమాచారాం తెలిసినట్లయితే వారు దగ్గరలోని పోలీస్ వారికి తెలియజేయాలని అన్నారు. సైబర్ నేరాల నుండి ప్రజలు అనునిత్యం జాగ్రత్తగా ఉండాలని, లోన్ యాప్లు ఎవ్వరూ డౌన్లోడ్ చేసుకోరాదని, వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా ఎవ్వరివైన ఫోటోలు ఉపయోగించి ఆపదలో ఉన్నమని డబ్బులు తొందరగా పంపుమంటే పంపకూడదూ, దానికోసం ఫోన్ చేసి పూర్తి విషయాలు కనుక్కోవాలని తెలియజేశారు. నేరచరిత్ర కలిగిన వారు తమ ప్రవర్తనను మార్చుకోవాలని, ప్రవర్తన మార్చుకోకుంటే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డిప్యూటీ పోలీస్ కమీషనర్ ( ఎల్ అండ్ ఓ )  ఎస్. జయారామ్, నిజామాబాద్ ఎ.సి.పి కిరణ్ కుమార్, సి.ఐలు 8, ఎస్.ఐ.లు  12 మంది, ఎ.ఎస్.ఐలు / హెడ్ కానిస్టేబుల్స్/ కానిస్టేబుల్స్ / మహిళా పోలీస్ / మహిళాహోమ్ గార్డులు 130 మంది పోలీస్ సిబ్బంది, నేహ్రు నగర్, రాంనగర్ సర్పంచులు అమానుల్లా, జిలానీ, ఎమ్.పి.టి.సి  స్వామి కాలనీ వాసులు పాల్గొన్నారు.