మూసీ క్లీనింగ్‌ ప్రక్రియను పూర్తి చేయండి

ముందుగా మూసీ క్లీనింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నానక్‌ రామ్‌– అధికారులకు సీఎం ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముందుగా మూసీ క్లీనింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నానక్‌ రామ్‌ గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై ఆయన అధికారులతో సమీక్షించారు. మూసీ రివర్‌ బౌండరీస్‌ లొకేషన్‌ స్కెచ్‌ తో పాటు పలు వివరాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. అభివృద్ధి చర్యలు వేగవంతంగా చేసేందుకు వీలుగా అధికారులకు పని విభజన చేయాలని సూచించారు.