జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన త్యాగధనుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య

– సీపీఐ(ఎం) చండూరు మండల సహాయ కార్యదర్శిజెర్రిపోతుల ధనుంజయ గౌడ్
నవతెలంగాణ – చండూరు  
జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన త్యాగదనుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఐ(ఎం) చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. ఆదివారం రోజున చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భూమిలేని నిరుపేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టిన చరిత్ర సుందరయ్య గారిది అని, తన సొంత భూమిని కూడా పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర సుందరయ్యదని ఆయన కొనియాడారు. భూస్వాములకు, పెత్తందారులకు, దోపిడి అన్యాయాలకు  వ్యతిరేకంగా పోరాడి, ఆనాడు చట్టసభల్లో ప్రజల తరఫున తన వాణిని వినిపించారని అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చి మళ్లీ ఉద్యమ నిర్మాణాన్నిపటిష్టం చేసేందుకు,విస్తృత పరిచేందుకు అంకితమైనరని ఆయన అన్నారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన పుచ్చలపల్లి సుందరయ్య చిన్న వయసులోనే సంఘసంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్నారని  అన్నారు. సీపీఐ(ఎం) ఏర్పడినప్పుడుతొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారని,ప్రధాన కమ్యూనిస్టు పార్టీగా తీర్చిదిద్దడానికి పునాదులు వేశారనిఆయన అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంకొనసాగిస్తూ, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కృషి గణనీయమైనదని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధన కోసంప్రతి ఒక్కరు కృషి చేయాలనిఆయన అన్నారు. భారతదేశంలోదోపిడి, అసమానతలు లేని సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేశారని  ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు  అంతిరెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు ఈరగట్లస్వామి, ఈరటి వెంకన్న, సోనగోనిగణేష్, కొత్తపల్లి వెంకన్న, బొమ్మరగోని యాదయ్య,యాదయ్య,ఓర్సు రాములు, యాదయ్యతదితరులు పాల్గొన్నారు.