పేట నియోజక వర్గంలోనూ కాంగ్రెస్ హవా…

– రెండో స్థానంలో బీఆర్ఎస్..

– మొగ్గ తొడుగు తున్న కమలం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పార్లమెంట్ ఎన్నికల్లో అశ్వారావుపేట లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ప్రతీ బూత్ లోను ఈ పార్టీ అభ్యర్ధి రఘురామిరెడ్డి తన సత్తా చాటారు. ఆరు నెలలు క్రితం వరకు అధికారం లో ఉన్న టీఆర్ఎస్ రెండో స్థానంలో వెనుకబడింది.ఎం.పీ గా రెండు సార్లు పనిచేసిన నామ నాగేశ్వరరావు ద్వితీయ స్థానం కొత్తగా పోటీ పడ్డా రామ సహాయం వెనుక నిలబడాల్సి వచ్చింది. ఈ నియోజక వర్గంలో నూ భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి వచ్చింది.గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పార్టీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు వేలల్లో ఓట్లు సాధించడంతో కమలం వికసించింది.
మండలం                            పార్టీ  
                      కాంగ్రెస్       బీఆర్ఎస్       భాజపా
ముల్కలపల్లి      12873         6107          1801
చండ్రుగొండ       11562         5327          1269
అన్నపురెడ్డిపల్లి    7795         3975            839
దమ్మపేట           22341        8648          2483
అశ్వారావుపేట   21545         9132          2891
మొత్తం              76116       33183         9283
ఈ నియోజక వర్గంలో మొత్తం 159174 మంది ఓటర్లకు గానూ 128848 మంది ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.