నియంత పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌

 Adilabadనవతెలంగాణ-జన్నారం
ప్రజా పాలన ముసుగులో రేవంత్‌ నియంత పాలన సాగిస్తోందని బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై నాయకులపై పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దాడి చేసిన కాంగ్రెస్‌ గూండాలను వదిలి బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. సీఎం కనుసన్నల్లో సాగుతున్న ధ్వంద విధానాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని విమర్శించారు. నిర్భందాలు అరెస్టులు ఆంక్షలు బిఆర్‌ఎస్‌ పార్టీకి కొత్తకాదని అరెస్టులకు బెదిరేది లేదని అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని అన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ సుతారి వినరు కుమార్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కమ్మల విజయ ధర్మ, జిల్లా నాయకులు సిటిమల భరత్‌ కుమార్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు మున్వర్‌ అలీ ఖాన్‌, జిల్లా నాయకులు ఫజల్‌ ఖాన్‌, బోర్లకుంట ప్రభుదాస్‌, బాలసాని శ్రీనివాస్‌ గౌడ్‌, ఐలవేణి రవి, శ్రీధర్‌ రావు, దుమల్ల ఎల్లయ్య పాల్గొన్నారు.