కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Congress party is the party of the poor: Komati Reddy Raj Gopal Reddyనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ మండలంలోని  చౌటుప్పల్,లింగారెడ్డిగూడెం,కుంట్లగూడెం, మందోళ్లగూడెం,నేలపట్ల గ్రామాల భూ నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని మనుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారిని సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో కలిసారు. రీజినల్ రింగ్ రోడ్డు  కింద భూములు కోల్పోతున్నామని అక్కడ ఉన్న మార్కెట్ రేటు కంటే  ప్రభుత్వం ఇచ్చే పరిహారము చాలా తక్కువగా ఉంటుందని శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ కి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి భూములు కోల్పోతున్న నిర్వాసితుల వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరారు.వీలైనంతగా రైతులకు న్యాయం చేయడానికే పాటుపడాలన్నారు. మార్కెట్ రేటు చాలా ఎక్కువగా ఉందని ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకు సరిపోదని  ఎలాగైనా తమకు న్యాయం చేయాలని రీజినల్ రింగ్ రోడ్డు లో  భూములు కోల్పోతున్న రైతులు ఎమ్మెల్యే గారిని  కోరారు. నేను రైతు పక్షపాతినని  రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి వెనకాడనని చెబుతూనే సాధ్యమైనంతగా ప్రభుత్వంతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి బండారు నరసింహ ఆధ్వర్యంలో రైతులు భారీ ఎత్తున ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినీ కలిసి త్రిబుల్ ఆర్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు.