– కార్పొరేటర్, కాంగ్రెస్ నేత జగదీశ్వర్ గౌడ్
– మానవాళికే బట్టను పరిచయం చేసిన గొప్ప కుటుంబం పద్మశాలీయులు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన, పద్మశాలీల చేనేత కుటుంబాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభు త్వం ఎల్లవేళలా కృషి చేస్తోందని, రాష్ట్రంలోని ప్రతి పద్మశా లిని కలిసి చైతన్యం చేయాలని శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శని వారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలిలో హైటెక్ సిటీ పద్మశాలి సంఘం అధ్యక్షులు గంజి శ్రీనివాస్ ఆధ్వర్యం లో నిర్వహించిన పద్మశాలి సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీ కార, నూతన 2024 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..బాపూజీ స్థాపించిన రాజమొహల్లా పద్మ శాలి భవన్ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ ప్రణాళికతో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. నూతనంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గం ప్రతి పద్మశాలిని చైత న్యవంతం చేయా లని కోరారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని తృణ ప్రాయంగా పదవికి రాజీనామా చేసిన బహుజన బిడ్డ బాపూజీ,1941 సంవత్సరంలో చేనేత సహకార సంఘాల వ్యవస్థను పటిష్ట పరచారు. బాపూజీ ఆశయ సాధన కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదించి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా మని తెలిపారు. సంఘటితంగా పద్మశాలీలందరూ కదలా లని పిలుపునిచ్చారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గం
అధ్యక్షులు గంజి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వరప్ర సాద్, గౌరవ అధ్యక్షులు మెరువ సత్యనారాయణ, కోశాధి కారి చెన్న రాము, ఉపాధ్యక్షులు గడ్డం వెంకటేష్, పాలాది ప్రభాకర్, సిలివేరు మహేష్, కుకుడాల ఆంజనేయులు, శ్రీదేవి వైద్య,ముఖ్య సలహాదారులు బొల్లి కృష్ణహరి, పండా ల నరసింహులు, సలహాదారులు, చింతకింది విటల్, మో త్కూర్ విజయలక్ష్మి, న్యాయ సలహాదారులు అనిల్ వైద్య, ఆర్థిక సలహాదారులు గంజి సాయికృష్ణ, కార్యని ర్వాహక కార్యదర్శి గద్దె శ్రీనివాస్, పులిజాల శివప్రసాద్, ఆడెపు మల్లేష్, గంజి అనురాధ, సాంస్కృతిక నిర్వాహకులు తిరు మల రఘురామ్, ప్రచార కార్యదర్శి, గడ్డం సురేష్, గద్దె జ్యోతి, తాటి విజయలక్ష్మి, కార్యదర్శి కరుణాతం మునింద ర్ తదితరులు ఎన్నికయ్యారు. నాయకులు మన్నేపల్లి సాంబశివరావు, గోపాల్, ప్రసాద్ తదితరులున్నారు.