– వేతనాలు 30 శాతం పెంపు
– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 29 మినీ గురుకులాల్లో పని చేస్తున్న 418 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి హరిత శనివారం (జీవోనెంబర్ 1407) ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు వారి సర్వీసులను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. 418 మంది వేతనాలను 30 శాతం పెంచుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల తెలంగాణ మినీగురుకులం ఉద్యోగుల సంఘం (టీఎస్యూటీఎఫ్ అనుబంధం) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమావత్ జ్యోతి, బాణోత్ లక్ష్మి, ఉపాధ్యక్షులు కవిత, అనూష హర్షం ప్రకటించారు. వేతనాలను పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కార్యదర్శి నవీన్ నికోలస్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవికి కృతజ్ఞతలు తెలిపారు.