ఉద్యోగాలైన ఇవ్వండి, నిరుద్యోగ భృతినైన కల్పించండి: సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు

– ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఉమ్మడి సమావేశంలో పిలుపు
నవతెలంగాణ – భువనగిరి
ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ కార్యాలయంలో ఎల్లంకి మహేష్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి గోదాశ్రీ రాములు హాజరై మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రధానంగా యువకులు విద్యార్థులు లక్షలాదిమంది ఏలాంటి పనులు లేకుండా ఉన్నారని నిరుద్యోగులకు ఉద్యోగాలైన ఇవ్వండి లేదా వారికి నిరుద్యోగ భృతి రూ.5000 రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలన్నింటినీ ఈనెల 6న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యువజన, విద్యార్థి సంఘాలు అమలు కోసం ఛలో కలెక్టరేట్ కార్యాలయానికి పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లాలో యాదాద్రి దేవాలయం నిధులతో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయించాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని అలాగే రైతులు వ్యవసాయ కూలీలు సాగు, త్రాగునీరు కోసం బూనాది గాని కాలువ, పిల్లాయిపల్లి కాలువలు కూడా పూర్తి చేయాలన్నారు.గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేయాలని మూసి ప్రక్షాళన త్వరగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం యువజన విద్యార్థి సంఘాలు సమరశీల పోరాటాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విద్యార్థి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఉప్పులశాంతి కుమార్, పెరబోయిన మహేందర్, వస్తువుల అభిలాష్,మమ్మద్ నయీమ్,సూరారం జానీ, సుద్దాల సాయికుమార్, మేడి దేవేందర్, మారుపాక లోకేష్, మొగుళ్ల శేఖర్ రెడ్డి, బద్దుల శ్రీనివాస్, బూడిద సాయి చరణ్, సునారి భగవాన్ పాల్గొన్నారు.