న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) తరుపున పోటీ చేయనున్న ముగ్గురి పేర్లను ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. కోర్బా జిల్లాలో కట్ఘోరా నుంచి జవహార్ సింగ్ కుమార్, సూరజ్పుర్ జిల్లాలోని భట్గావ్ నుంచి కపిల్ పయిక్రా, సర్గుజ జిల్లా లండ్రా (ఎస్టి) నియోజకవర్గం నుంచి బల్బీర్ నగేశ్ పోటీ చేయనున్నట్లు సీపీఐ(ఎం) తెలిపింది.