
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోనీ కుడ శివారు ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 126 లో అక్రమంగా రెడ్డి కమ్యూనిటీ హాల్, ఐటీ హబ్ లకు కేటయించించిన స్థలాన్ని రద్దు చేసి ఆ స్థలాన్ని పేదలకు ఇవ్వాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ అన్నారు. మంగళవారం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ అధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కుడ కుడ శివారులో ఉన్న వంద ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఐదు ఎకరాలలో నిలువ నీడ లేని నిరుపేదలు గత నాలుగు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని అన్నారు. వీరందరికీ పట్టాలు ఇవ్వాలని ఎమ్మార్వో, కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం, గత ప్రభుత్వంపై మా పార్టీ అధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశాము అని గుర్తు చేశారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు పట్టాలు ఇవ్వకుండా పేదలు వేసుకున్న గుడిసెలు తొలగించి అక్రమ కేసులు పెట్టించాడని దుయ్యబట్టారు. ఆ భూమిని పేదలకు చెందకుండా బిఆర్ఎస్ నాయకులు, అతని అనుచరులు కబ్జా చేసి 58,59 జిఓ లో పట్టాలు చేపించుకని అమాయక పేద ప్రజలకు అమ్ముతున్నారనీ అవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాన్ని ఎన్నికలలో గెలవాలని ఎన్నికల ముందు అక్రమంగా రెడ్డి కమ్యూనిటీ హాల్, ఐటీ హబ్ లకు కేటాయించడం అన్యాయం అన్నారు. సూర్యాపేట లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు, బిఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిన భూమిని వెలికి తీసి ఐటీ హబ్ కి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే గుడిసెలు వేసుకున్న స్థలాన్ని పేదలకు 126గజాల చొప్పున ప్రతి ఒక్కరికీ ఇచ్చి,నిర్మాణానికి పది లక్షల రూపాయిలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మా పార్టీ అధ్వర్యంలో పేదలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన,ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్ యు రాష్ర్ట సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రాంజీ,పార్టీ డివిజన్ నాయకులు ఎస్కె సయ్యద్,వీరబోయిన రమేష్, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సురం రేణుక,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.