హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ వంటి క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. మేర్లపాక గాంధీ, యువి క్రియేషన్స్తో వరుణ్ తేజ్ చేస్తున్న తొలి చిత్రమిది. అయితే వరుణ్ తేజ్ గతంలో బ్లాక్ బస్టర్ ‘కంచె’ కోసం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో జతకట్టారు. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. యువి క్రియేషన్స్లో బ్లాక్ బస్టర్ ‘ఎక్స్ప్రెస్ రాజా’ని అందించిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఇప్పుడు వరుణ్ తేజ్తో కలిసి ఒక యూనిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించుకోనుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ అద్భుతమైన స్క్రిప్ట్ని రెడీ చేసిన ఈ ప్రాజెక్ట్లో వరుణ్ తేజ్ ఫ్రెష్, యూనిక్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ‘మా బ్యానర్ల ద్వారా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలను నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఆ లక్ష్యంలో భాగంగానే వరుణ్తేజ్, మేర్లపాక గాంధీ వంటి డిఫరెంట్ కాంబినేషన్లో ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం ఆనందంగా ఉంది’ అని మేకర్స్ తెలిపారు.