పొన్నం ను విమర్శించడం మీ చేతకాని తనానికి నిదర్శనం

– విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు జలగం ప్రవీణ్ కుమార్
– మంత్రిని విమర్శించే నైతిక అర్హత బీఆర్ఎస్ సన్నాసులకు లేదు: మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్
నవతెలంగాణ -తంగళ్ళపల్లి
ప్రజా గొంతుక పొన్నం ను విమర్శించడం మీ చేతకాని తనానికి నిదర్శనమని,మంత్రిని విమర్శించే నైతిక అర్హత బిఆర్ఎస్ సన్నాసులకు లేదని మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి దశ నుండి ఉద్యమాలే  ఊపిరిగా ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.మొన్నటి రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలో పొన్నం  కార్యకర్తలపై ఉన్న చనువుతో ప్రేమ అభిమానాలు కురిపిస్తూ వేదికపై కార్యకర్తలను ఉద్దేశించి సూచనలు చేస్తు,గత ప్రభుత్వ దోపిడీ, నిరంకుశ పాలన వల్ల ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం గురించి వివరిస్తున్నా క్రమంలో కొంతమంది బిఆర్ఎస్ సన్నాసులు వక్రీకరించుకుంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ ను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నారు మీ పార్టీ ఇచ్చిన అబద్ధాల హామీల సంగతి కేటీఆర్ ను అడిగే దమ్ము మీకుందా అని బిఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు. అధికారం లో ఉండి హామీలు అమలు చేయలేని బీఆర్ఎస్ దద్దమ్మలు మీరని ఎద్దేవా చేశారు.మార్పు కోరుకున్న తెలంగాణ సమాజం నిరంకుశ పాలన నుండి ప్రజా పాలన వైపు వెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పూర్మాణీ లింగారెడ్డి, నేరెళ్ల నర్సింగం గౌడ్,గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్, ఇటుకల మహేందర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.