కోట్లు ఖర్చు పెట్టి ఫేక్‌ ప్రచారం

Crores spent on fake campaign– డ్రామారావు ఇందులో రాటుదేలాడు
– తప్పుడు ప్రచారాలెన్ని చేసినా గెలిచేది కాంగ్రెస్‌ : రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్‌ ప్రచారాల్లో రాటుదేలిండు. తెలంగాణలో కాంగ్రెస్‌ సునామిని చూసి కేటీఆర్‌కి ఏం చేయా లో అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేక్‌ ప్రచారాలకు దిగిండు’ అంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి శనివా రం ట్వీట్‌ చేశారు. ‘నిన్న మొన్నటి దాకా కర్నాటక లో అధికారంలో ఉన్న వీళ్ల మిత్ర పార్టీ బీజేపీ, 40శాతం కమిషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించింది. అలాం టి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ 100 రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమ లు చేసి, రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి వైపు నడిపిస్తున్నది. ఇప్పుడు తెలంగా ణాలో నూ కాంగ్రెస్‌ దూసుకెళ్తుంటే, ఇన్ని రోజులు నింపుకు న్న జేబులను ఇప్పు డు దులుపుతు న్నారు. మీరెన్ని తప్పు డు ప్రచారాలు చేసినా, కోట్లు కుమ్మరి ంచి నా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం! కాంగ్రెస్‌ వస్తుంది! తెలంగాణ గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.