
నవతెలంగాణ – చౌటకూర్ : ఉమ్మడి పుల్కల్ మండలంలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవాలి. ఈ సందర్భంగా ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేడుకలు జరుపుకోవాలని పుల్కల్ మండల ప్రజలకు సూచించారు.ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డీజేలు, అధిక శబ్దం వచ్చే బాక్స్ లు ఏర్పాటు చేసిన, మద్యం మత్తులో వాహనాలు నడిపిన, వాహనాలను ఇష్టానుసారంగా నడిపిన, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాలలో మద్యం సేవించిన, మైనర్ యువకులు వాహనాలు నడిపిన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కొత్త సంవత్సరం వేడుకలను ప్రజలు తమ ఇండ్లలోని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ మండల ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.