నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో వలిగొండ రోడ్డులో నూతన శివాలయంలో దీక్ష చేపట్టిన శివ స్వాములకు అన్న సంతార్పణ చేసిన బీఎన్ రెడ్డి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బి.యన్.రెడ్డి మాట్లాడుతూ శివ స్వాములకు అన్నదానం చేయుటము తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. శివ స్వాములకు అన్నదానం చేయుటము మా కుటుంబానికి చాలా సంస్కృతి కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు బండి స్వామి,దోటి రమేష్,వెంకటరమణ,వీరమల్ల దాసు, కారింగు రాములు గౌడ్,బొంగు శీను,స్వామి, దొనకొండ రాజు,జింక వెంకటేశం,శ్రీమన్నారాయణ, సాయి,సదానందం,నరసింహ,దోర్నాల గజేందర్, విగ్నేష్,మధు అర్చకులు సంతోష్ కుమార్ సేవకురాలు లక్ష్మమ్మ మాత శివ స్వాములు తదితరులు పాల్గొన్నారు.