
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
మనుషులంతా ఒక్కటే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటే సమాజంలో ఎవరి పట్ల ఎలాంటి వివక్షా ఉండదని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని 16వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ సలిగంటి సరిత వీరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిమ్న జాతుల పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అంబేద్కర్ జాతికి గొప్ప సందేశాన్ని అందించాలని రాజ్యాంగాన్ని రచించాడన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాడన్నారు.దళితులు చదువును ఆయుధంగా చేసుకొని చైతన్యవంతులు కావాలని ఎన్నో గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, ఆహారాన్ని అందిస్తున్నాడని గుర్తుచేశారు. కులాలను మనమే నిర్మించుకున్నామని మనుషులంతా ఒక్కటే అనే భావన ఉంటే ఎలాంటి వివక్ష ఉండదన్నారు.దళితులు చదువు ను ఆయుధంగా చేసుకొని జీవితంలో అభివృద్ధి చెందాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ ఇందిరా,మానస,మెప్మా సీఈవో ఉమా, వార్డ్ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు, వార్డు పార్టీ నాయకులు హనుమంతు,రవీందర్,వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.