‘దండోరా’ మొదలైంది

'Dandora' startedనేషనల్‌ అవార్డ్‌ గెలుచుకున్న చిత్రం ‘కలర్‌ ఫోటో’, ‘బెదురులంక 2012’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అందరి దష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణ సంస్థలో ‘దండోరా’ సినిమా రూపొందనుంది. మురళీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీ బుధవారం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను లాంఛనంగా పూర్తి చేసుకుంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాహు గారపాటి క్లాప్‌ కొట్టగా, ‘బేబీ’ నిర్మాత ఎస్‌కేఎన్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ప్రొడ్యూసర్‌ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’ సినిమాను  రూపొందించనున్నారు. మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా తెరకెక్కనుంది. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్‌, రాహుల్‌ రామకష్ణ, రవికష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు ప్రధాన పాత్రలతో మెప్పించనున్నారు అని చిత్ర బృందం  తెలిపింది. ఈ చిత్రానికి నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, దర్శకత్వం: మురళీకాంత్‌, సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ఆర్‌.శాఖమూరి, ఎడిటర్‌: గ్యారీ బి.హెచ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌: మార్క్‌ కె.రాబిన్‌, ఆర్‌ డైరెక్టర్‌: క్రాంతి ప్రియం, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎడ్వర్డ్‌ స్టీవెన్‌సన్‌ పెరెజీ, కో ప్రొడ్యూసర్‌: అనీష్‌ మరిశెట్టి.