పుట్టిన వారికి మరణం తప్పదు..

Death is inevitable for those who are born.జెడి చక్రవర్తి, నరేష్‌ అగస్త్య, సీరత్‌ కపూర్‌ లీడ్‌ రోల్స్‌లో శ్రవణ్‌ జొన్నాడ రచన, దర్శకత్వం వహించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జాతస్య మరణం ధ్రువం’. త్రిష ప్రెజెంటర్‌గా సురక్ష్‌ బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌ నటి ప్రీతీ జింగానియా కూడా రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి ‘జాతస్య మరణం ధ్రువం’అనే టైటిల్‌ ఖరారు చేసిన మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని లాంచ్‌ చేశారు. ఒక సంస్కృత పద బంధం నుంచి వచ్చిన ఈ టైటిల్‌కు ‘పుట్టినవారికి మరణం తప్పదు’ అని అర్థం. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా పాన్‌ ఇండియా రిలీజ్‌ కానుంది. రాజేష్‌ శర్మ, తనికెళ్ల భరణి, లావణ్య షావుకారు, హిట్టెన్‌ తేజ్వాణి, మస్త్‌ అలీ, తులసి, ఈటీవీ ప్రభాకర్‌, జెమినీ సురేష్‌, షీనా చౌహాన్‌, షబీనా, ఇంధు, సోనియా, తాగుబోతు రమేశ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి రచన, సంగీతం – జిబ్రాన్‌, రాజ్‌, ఎడిటర్‌- విప్లవ్‌ నైషదం.