అసమర్ద..అబద్దాలతో మోసం చేస్తున్న బీఆర్‌ఎస్‌,బీజేపీ లను ఓడించండి

 –  జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ విశ్రాంత ఐఎఎస్ ఆకునారి మరళి.
నవతెలంగాణ – భువనగిరి: అసమర్దత,అబద్దాల,అహంకారంతో పాటు మత విద్వేష, ఫాసిస్టు పాలన సాగిస్తున్న మోడీ సర్కారును, అవినీతి నియంతృత్వ కేసీఆర్ పాలనను   అంతమొందించాలని   తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ విశ్వాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక, జాగో తెలంగాణ బస్సుయాత్ర 14 వరోజు  భువనగిరి జిల్లా లోని బిబీనగర్. భువనగిరి లలో  నిర్వహించారు. ఈ సందర్భంగా జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ విశ్రాంత ఐఎఎస్  ఆకునూరి మురళి  మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వేలకోట్ల కుంభకోణాలతో కేసీఆర్ కుటుంబం తన్నుకుపోయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ పేరిట అడ్డు అదుపులేని అవినీతి జరిగిందన్నారు. అవినీతి ఫలితంగానే ప్రాజెక్టు కుంగుబాటుకు గురైందన్నారు. రాష్ట్రంలో విద్యా, వైద్యం నాశనం అయిందన్నారు. నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. నిరుపేదలకు ఇల్లు, ఇళ్ల స్థలాలు, కార్మికులకు కనీస వేతనాలు అందలేదన్నారు. రైతుబంధు రైతులు కానీ రైతులకు జేబులు నింపుతుందన్నారు. చిన్నస్థాయి రైతులు, రైతు కూలీల బతుకులు అద్వానంగా మారాయన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసిన నియంతృత్వ కేసీఆర్ పాలనను ఓడించాలన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం విదేశాలలో ఉన్న నల్ల ధనం తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అనే భారీ ఎజెండాను ప్రకటించి మొండి చేయి చూపిందన్నారు. కానీ బడా కార్పొరేట్ కంపెనీలకు 16లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందన్నారు. ప్రజల మధ్య కులమత బేధాలు రెచ్చగొట్టే విధానాలు అమలు చేస్తూ, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందన్నారు. మోడీ విధానాలను 9 ఏళ్లుగా కేసీఆర్ సమర్థిస్తూ వచ్చారన్నారు. వీరికి మతతత్వ ఎంఐఎం పార్టీ మద్దతిస్తుందన్నారు. ఈ మూడు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ఓట్లు, సీట్ల రాజకీయం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో, దేశంలో దేశ సంపదను దోచుకుంటూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న మోడీ, కేసీఆర్ సర్కార్లను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  ప్రోపెసర్ పద్మజా షా, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, ప్రొపెసర్ రమ,నైనాల గోవర్దన్,  హన్మష్ ,దళిత బహుజన ఫ్రంట్  జాతీయ కార్యదర్శి పి.శంకర్, దళిత ఐక్యవేదిక జిల్లాఅధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య,  పియం సి రాష్ట్ర కన్వీనర్ ఎస్.శివలింగం,  పులి కల్పన,  పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు మామిడికాయల పరశురాం, సామాజికోద్యమ నాయకులు కొడారి వెంకటేశ్,  మల్లారెడ్డి,  పొలిశెట్టి అనిల్, వైయస్సార్ టిఏస్ జిల్లా అధ్యక్షులు అతహార్, శ్రీనివాసాచార్యులు,  హమీద్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జానీ పాల్గొన్నారు.