‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్పుత్. ఆమె ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రక్షణ’. రోషన్, మానస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్పై ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ మాట్లాడుతూ, ”రక్షణ’ టీజర్కు చాలా మంచి స్పందన వస్తుంది. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా తెరకెక్కింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించాం. ఈ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ను జూన్ 7న విడుదల చేస్తున్నాం’ అని అన్నారు.
రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: ప్రణదీప్ ఠాకూర్, నిర్మాత: ప్రణదీప్ ఠాకూర్, ఛాయాగ్రహణం: అనిల్ బండారి, సంగీతం: మహతి సాగర్, సౌండ్ డిజైనర్: జె.ఆర్. ఎతిరాజ్, ఎడిటర్: గ్యారి బి హెచ్, స్టంట్స్: వెంకట్ మాస్టర్, ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్, రైటర్: తయనిధి శివకుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ జోసెఫ్, రమేష్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శరద్ వాఘ్రే.