డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ బ్యాక్ లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతం

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల  పరిధిలోని వన్ టైం ఛాన్స్ ( సి బి సి ఎస్ ) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ  కోర్సులకు ఐదవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు 13వ రోజు ప్రశాంతంగా జరిగాయి.గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి, ఎస్ ఆర్ ఎన్ కె  గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బాన్సువాడ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్మూరు లో జరిగిన పరీక్షకు ఉదయం 177 మంది విద్యార్థులకు 166 మంది విద్యార్థులు హాజరయ్యారు 11 మంది  గైరాజరయ్యారు.మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 211 మంది విద్యార్థులకు 197 మంది విద్యార్థులు హాజరయ్యారని 14 మంది విద్యార్థులు గైరాజరయ్యారని  ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా  చంద్రశేఖర్ తెలియజేశారు.