న్యాయసలహాలు అందించిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనర్సయ్య

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్  జి. వైజయంతి ఆదేశాల మేరకు శనవారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి.లక్ష్మినర్సయ్య, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నేటి రోజున సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమావేశములో బాధితులకు ప్రభుత్వం ద్వారా పరిహారం పొందే విదానంపై మరియు సాక్షులను విచారించే విదానం మరియు నేరస్తులకు ఖచ్చితంగా శిక్షపడటానికి సాక్షులను పొందుపరుచు విదానం గురించి డిప్యూటి డైరెక్టర్ లక్ష్మీనర్సయ్య క్లుప్తంగా వివరించారు. ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన విధులను శ్రద్ధతో నిర్వహించి, నేరస్తులకు శిక్షపడేటట్లు కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్, రాజారెడ్డి, బంటు వసంత్, కావేటి శేషు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఖాందేష్ శ్రీనివాస్, నిమ్మ దామోధర్ రెడ్డి, మహ్మద్ రహిముద్దిన్, డి. వీరయ్య, భూసారపు రాజేష్ గౌడ్, అశోక్ శివరాంనాయక్, పొరిక రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.