– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.శంకర్
– కళాశాల ఎదుట ధర్నా
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న గురునానక్ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బి.శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురునానక్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ పేరుతో గురునానక్ కళాశాల యాజమాన్యం విద్యార్థులను మోసం చేసిందన్నారు. మొత్తం నాలుగు వేల మంది విద్యార్థుల నుంచి రూ.మూడు లక్షల చొప్పున డొనేషన్లు తీసుకొని సుమారు రూ.100 కోట్లు వసూలు చేశారన్నారు. ఇప్పటి వరకు ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేదన్నారు. గురునానక్ యాజమాన్యంపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రణరు, ఉపాధ్యక్షులు మస్కు చరణ్, సహాయ కార్యదర్శి సిద్దు, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్ష, కార్యదర్శులు తరంగ్, మద్దెల శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు విప్లవ కుమార్, సుమంత్, కురుమిద్ద శివ, నాయకులు వంశీ, వినోద్, వినరు, వర్షిత్, సంపత్, లక్ష్మణ్ పాల్గొన్నారు.