– అభ్యర్థులకు గౌరవ ప్రదమైన ఓటమి
– మంథనిలో 28మందు నామినేషన్ దాఖలు
నవతెలంగాణ- మల్హర్ రావు
ఎదుటి పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తరుచూగా అంటున్న మాటలివి. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అభ్యర్థులకు తమ డిపాజిట్ డబ్బులు తిరిగి వస్తే అది గౌరవ ప్రదమైన ఓటమిగా భావిస్తారు. ఆ డబ్బలు తిరిగి రాకపోతే అభ్యర్థి చిత్తుగా ఒడినట్టే లెక్క.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే…
శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.10 వెలు డిపాజిట్ గా ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించారు ఎస్సి,ఎస్టీ అభ్యర్థులు మాత్రం రూ.5వెలు చెల్లిస్తే సరిపోతుంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి వద్ద ఈ డబ్బులను డిపాజిట్ చేస్తారు.సదరు అధికారి ఈ మొత్తాన్ని ఎస్టీఓలోని ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు.నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి అభ్యర్థులు వ్యక్తిగత వివరాల పరిశీలన, సర్టిఫికెట్లు,ఈవిఎం లపై గుర్తుల కేటాయింపు, సర్వీస్ ఓటర్లకు బ్యాలెట్ పేపర్లపై గుర్తులను ముద్రించడం వంటి ప్రతి అంశంపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంటుంది. అభ్యర్థికి సంబంధించిన ప్రచార ఖర్చులు ప్రతి కదలికపై ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక అధికారుల బృందాలు నిశిత పరిశీలన చేస్తారు.అభ్యర్థులు ఎదో నామమాత్రంగా పోటీ చేస్తే ఎన్నికల సంఘానికి అనవసర ఖర్చు పెరగడంతో పాటు అధికారుల విలువైన సమయం వృధా అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘము పోటీ చేసే అభ్యర్థుల నుంచి షరతులతో కూడిన తిరిగి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్లను స్వీకరిస్తోంది.
ఆరోవ వంతు ఓట్లు సాధిస్తేనే…
ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో ఆరోవ వవంతు ఓట్లను సాధించాల్సి ఉంటుంది. ఆరోవ వంతు ఓట్లు వచ్చి అభ్యర్థికి ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రిటర్నింగ్ అధికారి తిరిగి డిపాజిట్ చెల్లిస్తారు.లేకపోతే ఆ డబ్బులను ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకుంటారు.
విత్ డ్రా, స్కృటీనిలో తిరస్కరించిన వారికి ..
అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ పలు కారణాలతో విత్ డ్రా చేసుకుంటే వారి చెల్లించిన డిపాజిట్ తిరిగి చెలిస్తారు.నామినేషన్ల పరిశీలనలో తిరస్కరణకు గురైన వారికి డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల్లో బరిలో నిలవడం ఒక్కేత్తు అయితే డిపాజిట్ గల్లంతు అనేది అభ్యర్థులను కొన్ని రోజులపాటు నిరాశ చెందేలా చేస్తోందని నాయకులు చెబుతున్నారు.