ఓఆర్‌ఆర్‌ వరకు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలు

– సీఎస్‌ శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని పౌరులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధి వరకు జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలను విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్‌ నగరంతోపాటు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధి వరకు ఆకస్మిక వర్షాలు, వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బందులు రాకుండా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌, జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌ ఆమ్ర పాలి, జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.