
భిక్కనూరు పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో శుక్రవారం మహిళా సంఘాలతో నడుస్తున్న గ్రామ సంఘాల పుస్తకాలను కరీంనగర్ జిల్లాకు చెందిన సీఏ బృందంతో ఐకెపి ఎపిఎం శ్రీనివాస్ సమక్షంలో ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం ఏప్రిల్ నుండి ప్రస్తుత సంవత్సరం మార్చి వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలు, పుస్తకాలను తనిఖీ చేశారు. పుస్తకాలు రాస్తున్న వివో ఏలు, సీసీల సమస్యలను ఆడిట్ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్లు రవిరాజ్, కిరణ్, పవన్, మండల సమైక్య అధ్యక్షురాలు రాజమణి, కార్యదర్శి విజయ, కోశాధికారి లక్ష్మి, అకౌంటెంట్ అన్నపూర్ణ, కంప్యూటర్ ఆపరేటర్ నరేష్, రాము, సీసీలు, వివోఏలు పాల్గొన్నారు.