జక్రాన్ పల్లి  గ్రామానికి చెందిన గొల్ల కురుమలకు ఆరు యూనిట్ల గొర్రెల పంపిణీ

నవతెలంగాణ- జక్రాన్ పల్లి

జక్రాన్ పల్లి మండల కేంద్రంలో గొల్ల కురులకు 6 యూనిట్ లు పంపిణీ చేసినట్లు మండల పశువైద్యాధికారి శిరీష తెలిపారు.ఎంపీపీ కుంచాలా  విమల రాజు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్, మండల కో ఆప్షన్ సభ్యుడు బుల్లెట్ అక్బర్ ఖాన్, మండల పశు వైద్య అధికారి శిరీష,తదితరులు పాల్గొన్నారు.