అలరిస్తున్న తెలుసా..తెలుసా

మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమాలోని ‘తెలుసా తెలుసా…’ పాటను ఉమెన్స్‌ డే సందర్భంగా అగ్ర నాయిక సమంత సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పాటలో లక్ష్మీ ప్రసన్నతో పాటు ఆమె తనయ విద్యా నిర్వాణ మంచు కూడా కనువిందు చేయడం విశేషం. త్వరలో ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించ నున్నారు. ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్‌, విశ్వంత్‌, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ చిత్రానికి సంగీతం – అచ్చు రాజమణి, సినిమాటోగ్రఫీ-గోకుల్‌ భారతి, ఎడిటర్‌-మధు రెడ్డి.