వంశీ రామ్ పెండ్యాల, అజరు, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ సూపర్ విజన్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఫిల్మ్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా విజువల్స్ చూశాను. చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ ప్రతిభ చూపించారు. ఈ సినిమాకు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా కొత్త వారు చేశారు. ఇంతమంది కొత్త వాళ్లకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం నాకు ఆనందంగా ఉంది’ అని చెప్పారు. నిర్మాణ పర్యవేక్షకుడు ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబు మాట్లాడతూ, ‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా తుది దశకు వచ్చాయి. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం’ అని తెలిపారు.