ఆలయ నిర్మాణానికి రూ.25వేల విరాళం

నవతెలంగాణ -కమర్ పల్లి
మండల కేంద్రంలో నిర్మిస్తున్న నూతన అయ్యప్ప ఆలయానికి మండలంలోని హాస కొత్తూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ. 25వేలు  విరాళంగా అందజేశారు. ఈ మేరకు బుధవారం విరాళం మొత్తాన్ని ఆలయ నిర్మాణ కమిటీ  సభ్యులకు అందజేశారు. ఆలయ నిర్మాణానికి రూ.25వేల విరాళం అందజేసిన సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ కు  అయ్యప్ప ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు బద్దం రాజశేఖర్, సురంగి చంద్రశేఖర్, మల్యాల సుభాష్ గౌడ్, ఆక్స్ ఫర్డ్  శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.