ఆలయ నిర్మాణానికి రూ.25వేల విరాళం

నవతెలంగాణ –  కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో నిర్మిస్తున్న నూతన అయ్యప్ప ఆలయానికి గ్రామానికి చెందిన సామా నరేష్ మౌనిక దంపతులు ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయంగా రూ.25వేల విరాళం అందజేశారు. ఈ మేరకు బుధవారం  విరాళం మొత్తాన్ని సామా నరేష్ మౌనిక దంపతులు వారి కుమారుల చేతుల మీదుగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు.రూ. 25 వేల విరాళం అందజేసిన దాత కుటుంబానికి  అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ  కమిటీ సభ్యులు ఆకాంక్షిస్తూ, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు  బద్దం రాజశేఖర్, సురంగి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.