
నవతెలంగాణ – మల్హర్ రావు
అదైర్య పడవద్దు అండగా ఉంటామని అఖిల భారత యాదవ సంఘం నాయకులు బోయిని రాజయ్య యాదవ్,అబ్బినేని ఐలయ్య యాదవ్,గడ్డం చంద్రయ్య యాదవ్,గడవేని దేవేందర్ యాదవ్,మొగిలి రాజ్ కుమార్ యాదవ్ అన్నారు. మండల కేంద్రమైన తాడిచెర్లలో ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన చిన్నారులు అరుణ్,కార్తీక్ ల కుటుంబాన్ని సోమవారం దశదినకర్మ కార్యక్రమంలో భాగంగా పరామర్శించి, ఓదార్చారు. అదైర్య పడొద్దని చిన్నారుల తల్లిదండ్రులు బొంతల అనూష-రాజు దంపతులకు ధైర్యం చెప్పారు. అనంతరం చిన్నారుల ఆత్మకు శాoతి చేకూరలని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.