నవతెలంగాణ – తాడ్వాయి
“మద్యం సేవించి, వాహనాలు నడపొద్దు” అని తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలో ఎస్సై నన్నుగంటి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోయినా, వాహన అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనను అధిక్రమించి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతో పాటు.. లైసెన్స్ ను రద్దు చేస్తామన్నారు.ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.