నవతెలంగాణ- నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను గెలిపించాలని కోరుతూ శనివారం మండలంలోని మోదిని గూడెం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల యూత్ అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్, గ్రామశాఖ అధ్యక్షుడు వలిశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చిమట పవన్, యాదవ సంగం ఉపాధ్యక్షుడు పగడాల పుల్లయ్య, వార్డ్ మెంబర్లు వలిశెట్టి రేణుక, కుర్ర సైదులు, యాదవ సంగం మెంబర్ కుర్ర సంతోష్ , సీనియర్ నాయకులు పేర్ల ఎల్లయ్య, కుర్ర సైదులు, వలిశెట్టి నాగరాజు, బరిశెట్టి నాగరాజు, వలిశెట్టి మహేష్, కుర్ర సైదులు, ముడి విజేందర్, కుర్ర జానయ్య, బండారు దానెలు, మోదాల నాగయ్య పాల్గొన్నారు.