థాయిలాండ్‌లో డబుల్‌ ఇస్మార్ట్‌ షూటింగ్‌

In Thailand Double smart Shootingరామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కలయికలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ కొద్ది రోజుల క్రితం ముంబైలో ఒక ఇంటెన్స్‌ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించడంతో తొలి షెడ్యూల్‌ ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్‌ స్టైలిష్‌ మేకోవర్‌ అయ్యారు.
ఈ సినిమా రెండో షెడ్యూల్‌ థాయిలాండ్‌లో స్టార్ట్‌ అయ్యింది. ఈ షెడ్యూల్లో హీరో రామ్‌, సంజరు దత్‌ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సంజరుదత్‌ ఫస్ట్‌లుక్‌కి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తన నటీనటులను బెస్ట్‌ మాస్‌ అప్పీలింగ్‌లో ప్రజంట్‌ చేయడంలో స్పెషలిస్ట్‌ అయిన పూరి జగన్నాథ్‌ ఇందులో సంజరు దత్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించనున్నారు. రామ్‌, సంజరు దత్‌లను తెరపై కలిసి చూడటం అభిమానులకు, సినీ ప్రియులకు ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. ఈ వైల్డ్‌ కాంబినేషన్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ హై-వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కోసం హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ జియాని గియాన్నెల్లి పనిచేస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్‌ త్వరలోనే తెలియజేస్తారు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది మహా శివరాత్రి కానుకగా మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేసింది.