డిండి ఎత్తిపోతల పథకంకు డిపిఆర్ ను వెంటనే ఆమోదించాలి..

DPR should be approved immediately for the Dindi lift scheme.– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, 
నవతెలంగాణ – మునుగోడు
నల్లగొండ జిల్లాలో చామ పీడిత, ఫ్లోరైడ్ ప్రాంతాలైన దేవరకొండ , మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించే  డిండి  ఎత్తిపోతల పథకం కు డీపీఆర్ ను వెంటనే ఆమోదించి సాగునీరు అందించాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  శుక్రవారం  మునుగోడు మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య అధ్యక్షతన నిర్వహించిన మునుగోడు నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ2016లో  జీవో ఎంఎస్ నెంబర్ 107 ద్వారా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజులలో, 30 టీఎంసీల నీరు జిల్లాలోని సింగరాజుపల్లి గొట్టిముక్కుల చింతపల్లి లక్ష్మణాపురం శివన్న గూడెం రిజర్వాయర్లు నింపి సాగునీరు అందించడం ద్వారా ఈ మునుగోడు దేవరకొండ ప్రాంతాలను వ్యవసాయ రంగానికి నీరు అందించి అభివృద్ధి చేయాలని  అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ  రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కొంతమేరకు జరిగిన కీలకమైన డి పి ఆర్ ను ఆమోదించకపోవడం అట్లాగే సుమారు 27 కిలోమీటర్ల కాలువని తవ్వే పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాయకపోవడం ద్వారా ఆ ప్రభుత్వం తీవ్రమైన తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వెంటనే ఆమోదించి పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాసి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం  ప్రాజెక్ట్ రిజర్వాయర్ పనులు నిధుల కేటాయింపు విషయములో నిర్లక్ష్యం చేస్తే, ప్రజల నుండి తిరుగుబాటు ఎదురుకోవలసిన పరిస్థితి వస్తుందని తెలిపారు. వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టు, పూర్తి చేయడానికి కావలసిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న నల్లగొండలో ప్రాజెక్టుపై సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈ సదస్సులో మునుగోడు దేవరకొండ ప్రాంతంలోని రైతులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం పాలడుగు నాగార్జున గట్టుప్పల మునుగోడు నాంపల్లి మర్రిగూడెం మండల కార్యదర్శి కర్నాటి మల్లేష్ , నాంపల్లి చంద్రమౌళి , మిర్యల భరత్ , ఏర్పుల  యాదయ్య , నాయకులు మునుగోడు మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు , యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి , సాగర్ల మల్లేష్ , వడ్లమూడి హనుమయ్య ,ధనుంజయ , అచ్చిన శ్రీను , నారగోని నరసింహ తదితరులున్నారు.