
– ఎంపీడీఓ అనంత రావు
నవతెలంగాణ – డిచ్ పల్లి
నవతెలంగాణ – డిచ్ పల్లి
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనుల వద్ద త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, కూలీల సంఖ్యను రెట్టింపు చేయాలని ఎంపీడీవో అనంత రావు అన్నారు. గురువారం ఇందల్ వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎంపీడీవో అనంతరావు మాట్లాడుతూ ఏడు రిజిస్టర్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, నర్సరీల్లో మొక్కలు పెంచడం, ఎండను తట్టుకో వడానికి సెడ్ నెట్ను వేసి సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే వేసవిలో గ్రామాల్లో, తాగునీటికు ఎలాంటి లోటూ పాట్లు లేకుండా చూసుకో వాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలు, వచ్చే వేసవిలో తాగునీటి కి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసే విధంగా చూడాలన్నారు. ఉపాదిలో కూలీల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని, ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలు ఎపిఓ పోశెట్టికి అడిగి తెలుసుకున్నారు. పంచాయతీలో ఉన్న వసతులు తీసుకోవాల్సిన చర్యలపై కార్యదర్శులను అడిగి పలు సూచనలు, సలహాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ , ఇంచార్జీ ఎంపిఓ లక్ష్మారెడ్డి,పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్, నాగేష్, భారత్, అరుణ, సువార్త, అనూష, యశ్వంత్, పాశం అశోక్, సుశీల, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.