
మండలంలోని దోస్పల్లి గ్రామములో జీపీ సర్పంచ్ సునితా పటేల్ ఆధ్వర్యంలో డ్రై డే – ఫ్రై డే ను శుక్రవారంనాడు నిర్వహించడం జర్గింది. ఈ సంధర్భంగా సర్పంచ్, జేపిఎస్, ఆశా వర్కర్ కలిసి ఇంటింటికి తిరిగి వర్షకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యం, త్రాగునీరు, పారీశుద్ద్యం గురించి వివరించం జర్గింది. వర్షాలు భారీగా పడుతున్నాయని అవసరం అయితే తప్పా బయటికి రావద్దని , పాత ఇండ్లలలో ఉండవద్దని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పింకుబాయి, జెపిఎస్ జాదవ్ మనోహర్ , ఆశా వర్కర్ బశవ్వ, తదితరులు పాల్గోన్నారు.