మొహర్రం పండుగను శాంతియుతముగా జరుపుకోవాలి: డీఎస్పీ శివరాంరెడ్డి

Moharram festival should be celebrated peacefully: DSP Sivaram Reddyనవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఈ నెల 17 న జరిగే  మొహర్రం  పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని డిఎస్‌పి. శివరాంరెడ్డి కోరారు. నలగొండ ఒన్ టౌన్ పోలీసు స్టేషన్ లో సోమవారం  అలం కమిటీ సబ్యులు, ఆర్గనైజేర్స్, మత పెద్దల తో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  పండుగ ను భక్తి శ్రద్దలతో, ఎలాంటి ట్రాఫిక్ ఆంతరాయం లేకుండా జరుపుకోవాలని  సూచించిచారు. ఈ కార్యక్రమంలో నలగొండ ఒన్ టౌన్ సిఐ  రాజశేఖర్ రెడ్డి,  ఎస్ఐ వి.శంకర్, అలం కమిటీ సబ్యులు  తహేరుభాయి, బషీర్, హన్ను, పర్వెజు, యూసఫ్, తదితరులు లు పాల్గొన్నారు.