బంధాలకు ప్రతీకగా డుమ్మారే డుమ్మా

రామ్‌ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్కంద’-ది ఎటాకర్‌. ఈ సినిమా నుంచి బుధవారం ‘డుమ్మరే డుమ్మా..’ అంటూ సాగే పాటను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. తమన్‌ డిఫరెంట్‌ సిట్చ్యువేషన్స్‌కి డిఫరెంట్‌ ట్రాక్‌లను స్కోర్‌ చేశారు. లేటెస్ట్‌గా సెలబ్రేషన్స్‌ వైబ్‌లతో ఈ పాటని నింపారు. ఇది పల్లె అందాన్ని, కుటుంబ సభ్యుల మధ్య గొప్ప బంధాన్ని చూపిస్తోంది. ప్రతి భావోద్వేగాన్ని, ప్రతి సందర్భాన్ని జరుపుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రజెంట్‌ చేస్తోంది. అలరించే ట్యూన్‌లానే విజువల్స్‌ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకు కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం అందించగా, అర్మాన్‌ మాలిక్‌, అయ్యన్‌ ప్రణతి ఆహ్లాదకరంగా పాడారు. ఈ పాటలో రామ్‌, సయీ మంజ్రేకర్‌తో పాటు శ్రీకాంత్‌, గౌతమి కూడా సందడి చేశారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్‌ 15న రిలీజ్‌ కానుంది.