రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈనెల 13న విడుదల చేయాలని మేకర్స్ ముందు నుంచి సన్నాహాలు చేశారు. అయితే ఐదు చిత్రాలు పండగకు రావడంతో థియేటర్స్ రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ని వెల్లడించారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ‘మన తెలుగు సినిమా సంక్షేమం కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నాం. రావడంలో కొద్ది మార్పు, షాట్ అండ్ టార్గెట్లో కాదు. ఈగల్ ఫిబ్రవరి 9 నుంచి..’ అని రవితేజ ట్వీట్ చేశారు ‘ఈగల్’ కొత్త రిలీజ్ డేట్ను తెలియజేస్తూ..’బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం. మొండోడి మనసు పుట్ట తేనె. సంక్రాంతి బరి నుంచి ‘ఈగల్’ను ఫిబ్రవరికి తీసుకొచ్చాం. అందరూ చూడాల్సిన జనరంజక చిత్రం ప్రదర్శించడానికి అంతే మొత్తంలో థియేటర్లు కావాల్సి ఉంటుంది. దర్శకుడు, టీమ్ పనిని ప్రేక్షకులు చూసి మెచ్చుకోవడానికి ఇరుకులేని వేదిక, సమయం కావాలి. వీటన్నింటినీ దష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నారు. మారింది తేదీ మాత్రమే మాసోడి మార్క్ కాదు’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత : టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల.