
– మునుగోడును ఎర్రగొండగా చరిత్ర తిరగరాసేందుకు కమ్యూనిస్టులు సిద్ధమయ్యారు
– ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం
– పేదోడికి చెందాల్సిన పకృతి సంపదను పెట్టుబడుదారులకు కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వం
– ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ ఎక్కడ చేశారు కేంద్ర ప్రభుత్వం చూపాలి
– కమ్యూనిస్టుల మనోభావాలను దెబ్బ తినే విధంగా ప్రసంగాలు ఇస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలి
– సీపీఐ(ఎం) బలపరిచిన దోనూరి నర్సిరెడ్డి అభ్యర్థి గెలుపు కోసం కమ్యూనిస్టులు నడుం బిగించాలి
ప్రలోభాలు పెట్టే పార్టీలకు… ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సీపీఐ(ఎం) పార్టీకి జరుగుతున్న యుద్ధం
నవతెలంగాణ – చండూరు: మునుగోడు గడ్డ అంటేనే కమ్యూనిస్టుల అడ్డ అని మళ్లీ చరిత్రను పునరావతం చేసే విధంగా ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త దోనూరి నర్సిరెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో శిలా అనసూయ శంకర్రావు ఫంక్షన్ హాల్లో సీపీఐ(ఎం) మునుగోడు నియోజకవర్గ విస్తృతస్థాయిసమావేశానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన మునుగోడును ఎర్రగొండ గా చెప్పుకునే విధంగా మహనీయులు చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టుల బలం నిరూపించుకునే సమయం ఆసన్నమైందని అన్నారు. యాద్రాద్రి భువనగిరి జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జాంహిగిర్ మాట్లాడుతూ, కమ్యూనిస్టుల మనోభావాలను దెబ్బ తినే విధంగా ప్రసంగాలు ఇస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పేందుకు కమ్యూనిస్టులు నడుం బిగించి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు . గత పది సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్రాలను పాలిస్తున్న బిజెపి బీఆర్ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాయని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలను మభ్య పెట్టేందుకు కొత్త కొత్త హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు . కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజలకు చెందాల్సిన పకృతి సంపదను పెట్టుబడుదారులకు చౌక ధరల్లో పెట్టుబడుదారులకు కట్టబెట్టడంతో పెట్టుబడుదారులు ధరలు అధికంగా పెంచి ప్రజల నడ్డి విరిగే విధంగా ప్రభుత్వాలు 300కు ఉన్న గ్యాస్ సిలిండర్ 12 వందల కు పెంచడంతో పేద ప్రజలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రతి సంవత్సరం నిరుద్యోగుల సమస్యలను తీర్చేందుకు రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలలో 20 కోట్ల నిరుద్యోగుల భర్తీ ఎక్కడ చేశావో చూపించాలని కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారతాయని ఆశించిన పేద ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ వంటి పథకాలను ఆశ చూపి పేద ప్రజలను నిట్టున ముంచారని ధ్వజమెత్తారు. గత పది సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించకుండా దళిత బందు పథకం ఆశ చూపి మరోసారి పేద ప్రజలను మోసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద కుట్ర కు తెరలేపిందని అన్నారు . రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పరికరాలను , విత్తనాలను అందించకుండా రైతుబంధు పథకాన్ని అడ్డం పెట్టుకొని రైతులను మోసం చేస్తున్నదని ఆరోపణ చేశారు . ప్రజా సమస్యలను విస్మరించి పాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కు.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అండగా ఉండే కమ్యూనిస్టు పార్టీలకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ ఎర్రజెండా రాజ్యం కోసం సీపీఐ(ఎం) ప్రకటించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త ప్రత్యర్ధులకు దీటుగా గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు . ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్,యాద్రాద్రి భువనగిరి జిల్లాకార్యదర్శి ఎండి జాంహిగిర్, మునుగోడు సిపిఎం అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి, .డివైఎఫ్ఐరాష్ట్ర కార్యదర్శిఆనగంటి వెంకటేష్, సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, నాగిరెడ్డి,సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులుచాపల మారయ్య,కర్నాటి మల్లేశం,నాంపల్లి చంద్రమౌళి, బూరుస కృష్ణారెడ్డి, బండారి నరసింహ, గుంటజు శ్రీనివాస చారి, దొడ్డ యాదిరెడ్డి, మిర్యాలo భరత్, ఏర్పుల యాదయ్య,మొగుదల వెంకటేశం, గంగాదేవి సైదులు, జెర్రిపోతుల ధనంజయ గౌడ్, బొట్టు శివకుమార్, వరికుప్పల ముత్యాలు,తదితరులు పాల్గొన్నారు.