ఉద్యోగుల డీఏ చెల్లింపునకు ఈసీ బ్రేక్‌

నవతెలంగాణ బ్యూరో, హైదరాబాద్‌
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ చెల్లింపునకు ఈసీ బ్రేకులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, డీఏ చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈ మధ్య ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. ఇందులో 2022 జులై నెలకు చెందిన డీఏను ఇచ్చేందుకు రెడీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖపై కేంద్రనిఘా సంస్థల ద్వారా పూర్వాపరాలు తెలుసుకున్న ఎన్నికల సంఘం ఏడాదిగా పెండింగ్‌లో పెట్టిన డీఏను ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించింది. ఎన్నికలు అయ్యేవరకు మూడు వారాల పాటు ఆగాలని ఆదేశించింది.