మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

Economic development of fishermen is the government's missionనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పధం లో ముందుకు తీసుకొని వెళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం గౌరాయ పల్లి, గ్రామం లోని చెరువులో 30,000  చేప పిల్లలను జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జండగే తో కలిసి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదలడం వల్ల మత్స్యకారులకు, ముదిరాజులకు ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందని అన్నారు. మత్స్య  కారులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. చెరువులలో సమృద్ధిగా నీరు ఉన్నందున చేప పిల్లలు పెంచడానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు.  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గోదావరి నుండి నీళ్లు విడుదల కావడంతో మత్య కారులు అందరు అభివృద్ధి పధం లో ముందుకు వెళ్లాలని  అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. మత్స్యకారుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం  చేపల ఉత్పత్తిని పెంచడం జరుగుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి మహిళా శక్తి  స్కీమ్ ద్వారా జిల్లాలో కొత్తగా  మహిళా సంఘాలు ఏర్పాటు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రాజారామ్, మత్స్య సహకార సంఘ జిల్లా అధ్యక్షులు సంజయ్, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు కృష్ణ,  ఝాన్సీ, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్  చైతన్య రెడ్డి, మాజీ ఎంపిటిసి ఎడ్ల రామ్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమాల ఏలేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మండల నాయకులు కళ్లెం జాంగిర్, పన్నీరు భరత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.