– జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ, రసూల్ బి
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిరాశ్రయులైన వయోవృద్ధులను రాంపూర్ లో గల ప్రభుత్వ వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించుటకు కృషి చేయాలి అని జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ, రసూల్ బి మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వయో వృద్ధులకు ,60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు వసతి కల్పించుటకుగాను డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ గ్రామం నందు రాష్ట్ర ప్రభుత్వము ద్వారా వృద్దాశ్రమమును నిర్మించిందని, ప్రజా ప్రతినిధుల, జిల్లా అధికారుల వయో వృద్దుల పోషణ చట్టం జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వృద్ధాశ్రమము నిర్వహాణకై జిల్లా యంత్రాంగము మరియు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాద్ చే యం.ఓ.యు. చేయడమైనది అన్నారు. ఈ వృద్దాశ్రమములో కేవలం నిరాశ్రయులైన వయో వృద్ధులకు తేది 10-01-2025 నుండి వసతి కల్పించబడునని తెలిపారు. జిల్లాలో గల వయో వృద్దుల పోషణ, చట్టం జిల్లా కమిటీ సభ్యులకు మరియు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్, ఫోరమ్స్, ట్రస్టుల అధ్యక్షులకు ఇతర సభ్యులను, సమగ్ర శిశు పథక అభివృద్ధి అధికాణిలకు, అంగన్వాడీ సూపర్వైజర్లను, అంగన్వాడీ టీచర్లను తమతమ పరిగణలో గల నిరాశ్రయులైన వయో వృద్దులను రాంపూర్ లో గల ప్రభుత్వ వృద్ధాశ్రమము నందు ఆశ్రయము కల్పించుటకు కృషి చేయవలసినదిగా కోరారు. ఇతర వివరాలకై చైర్మన్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాద్ ఫోన్ నం. 9849933300 లేదా వృద్దాశ్రమ కో-ఆర్డినేటర్ ఫోన్ నం. 96188 44461 లేదా జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.