నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షునిగా నూతనంగా నియామకమైన కత్తుల మధు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్బిఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలని, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు తక్షణమే రెగ్యులర్ చేస్తూ ఒపీఎస్ వ్యవస్థని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థని రెండు గ్రేడ్ లుగా విభజించాలని, ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక….
జిల్లా అధ్యక్షులుగా కత్తుల మధు,
గౌరవ సలహాదారు తంగెళ్ల ఉపేందర్ రెడ్డి,
ప్రధాన కార్యదర్శి పూసపాటి నరేష్, కోశాధికారి ఏశబోయిన నరేష్, జాయింట్ సెక్రెటరీ బక్కతట్ల వెంకన్న, మహిళా అధ్యక్షులు కోడిరెక్క శైలజ,
ఉపాధ్యక్షులు గా ఎస్. అంజయ్య, జీ. వెంకటేష్,
పి. వెంకన్న, సిహెచ్. అశోక్, కె .సుజాత,
సహాయ కార్యదర్శులుగా సిహెచ్. రమేష్, వి. నవీన్, ఎం .వెంకటేష్, ఎల్.లక్ష్మి, కె .వెంకటేశ్వర్లు,
డివిజనల్ అధ్యక్షులుగా జైహిందర్ (దేవరకొండ),
బి .రామకృష్ణ (మిర్యాలగూడ),అశోక్ (నల్గొండ)ను ఎన్నుకున్నారు.