దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. నవంబరు ఏడున మొదలై డిసెంబర్ మూడున ఫలి తాల ప్రకటనతో ముగిసేదాకా ఎన్నికలు ఇచ్చే సంకే తాల కోసం దేశమంతా ఎదురుచూస్తున్నది. తర్వాత కొద్ది వారాల్లోనే పార్లమెంటు ఎన్నికలు కూడా జరగాల్సి వుండటం అందుకు ప్రధాన కారణం. శాసనసభల లోక్సభ ఎన్నికల ఫలితాలు అచ్చం ఒకే విధంగా వుండ కపోయినా ఓటర్ల సరళి, పార్టీల పోకడలు అర్థం కావడానికి తప్పక ఉపయోగపడ తాయి. అందులోనూ ఈ అయిదు రాష్ట్రాల్లో కీలకమైన మూడు హిందీ రాష్ట్రాలు, దక్షిణా దిన తెలంగాణ వున్నందున మిశ్రమ చిత్రా న్ని ఆవిష్కరించే ప్రత్యేక అవకాశం కలుగు తున్నది. కాంగ్రెస్, బీజేపీలే మూడు చోట్ల, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక చోట తలపడుతు న్నాయి గనక ‘ఇండియా’ వేదిక ప్రభావం కూడా తెలిసే సందర్భం. మధ్య ప్రదేశ్, రాజ స్థాన్ రెండు చోట్ల ముఖ్యమంత్రి స్థాయి నేత లనే బీజేపీ పక్కన పెట్టడం, పార్లమెంటు సభ్యులను ఎమ్మెల్యేలుగా పెద్దఎత్తున మోహరించడం, తెలంగాణ లో గట్టెక్కడం కోసం ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వాడు కోవాలని టీడీపీ నాయకుడు లోకేశ్ను పిలిపించడం వంటివి కేంద్ర పాలకుల అభద్రతను మొదటే స్పష్టం చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే వేదికలోని వామపక్షాలకు ఇతర భాగస్వాములకు తాము ప్రధానం గా వున్నచోట సీట్ల సర్దుబాటు చేయడం, అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడం సవాళ్లుగా వున్నా యి. బీజేపీ మతతత్వ రాజకీయాలను మోడీ సర్కారు ఏకపక్ష పోకడలను రాష్ట్రాలపై దాడిని నిరోధించడం తక్షణ కర్తవ్యమన్న మెళకువ పెరుగుతున్నది. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలోనే న్యూస్క్లిక్పై దాడి, అరుం ధతీ రారు వంటి ప్రముఖ రచయితపై కొత్తగా కేసు లు, అంతర్జాతీయంగా ఇజ్రాయిల్ దురాక్రమణలను ఖండించకపోగా వంత పాడటం, సనాతన వివాదానికి ఆజ్యంపోయడం, అయోధ్య రామాలయానికి రాజకీయ పదును పెంచడం కనిపిస్తూనే వున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు ప్రాంతీయ పార్టీలతోనూ బీజేపీ డబుల్ గేమ్ ట్రిబుల్గేమ్ దక్షిణాది క్రీడగా మారింది.
మూడు హిందీ రాష్ట్రాలు
బీజేపీ, కాంగ్రెస్లు తలపడే రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్. గతంలో ఇవి మూడూ కాంగ్రెస్సే గెలిచింది. ఒక్క మధ్యప్రదేశ్లో మాత్రం ఫిరా యింపులతో బీజేపీ సీనియర్ నేత శివరాజ్సింగ్ చౌహాన్ మళ్లీ అధికారం చేపట్టినా రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ఆపగలిగారు. చత్తీస్గఢ్లో భూపేష్ బెహగల్ కొనసాగారు. రాజస్థాన్లో మాత్రమే తమకు కాస్త అవ కాశముందని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. అయి తే మాజీ ముఖ్యమంత్రి రాజవంశీకురాలు వసుంధరా రాజేను ముందుకు తేలేదు. పరిస్థితి మారిందనే అభి ప్రాయం ఏర్పడింది. ఇక్కడ గత ముప్పైఏండ్లలోనూ అధికారంలో పార్టీని తిరిగి ఎన్నుకున్నది లేదు. సచిన్ పైలెట్ తిరుగుబాటును ఆఖరి నిమిషంలో ఆపగలిగినా అసమ్మతి అలాగే వుంది.పేపర్లీక్లు, అవినీతి ఆరో పణలు, శాంతిభద్రతల సమస్యలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. అన్నిటినీ మించి మతపరమైన ఉద్రిక్త తలు వాటిలో ఆరెస్సెస్ బీజేపీ పాత్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. 2002 జూన్లో ఒక టైలర్ తలనరకడం, 2008 పేలుళ్ల కేసులో నిందితులు విడుదల కావడం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయంగా బీజేపీ ఆరోపణలు చేస్తున్నది. పండుగలు, ఉత్సవాలు అంటే చాలు మత ఉద్రిక్తలు పెరుగుతున్నాయి.1993 బాబ్రీ విధ్వంసం తర్వాత ఎన్నికల్లో బీజేపీ (బైరాన్సింగ్ షెకావత్) తిరిగి ఎన్నికైన రాష్ట్రం ఇది. మోడీనే ప్రధానంగా ముందు పెట్టి అధికారంలోకి రావాలని బీజేపీ పథకాలు రచిస్తు న్నది. లోతట్టు ప్రాంతాల్లో చొచ్చుకుపోతున్నట్టు ఆరెస్సెస్ చెప్పుకుంటున్నది. రాజ్యవర్థన్ సింగ్రాథోర్, దివ్యకుమారి, బాబా బాలక్నాథ్ వంటి అనేకమంది ఎంపీలను బీజేపీ నిలబెట్టింది. అయితే తమ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని కాంగ్రెస్ భరోసాగా వుంది. తాను గెలిస్తే కులగణన చేపడతానని గెెహ్లాట్్ ప్రకటిం చడం కూడా అనుకూల అంశంగా భావిస్తున్నారు.ఏ కాస్త తేడా వచ్చినా సచిన్ పైలెట్ తప్పక సమస్య సృష్టించడం తథ్యమే.
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ మరింత కీలకమే గాక సమస్యాత్మకమైంది కూడా. గతసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జ్యోతి రాదిత్య సింధియా ఫిరాయింపు కారణం గా 2020లో అధికారం కోల్పోయింది. ఇప్పుడు బాగా అనుకూలంగా వుందని భావిస్తున్నా, సంపూర్ణ మెజార్టీ రాకపోతే కష్టమనే ఆ భయాలు వెన్నాడుతూనే వున్నాయి. మూడుసార్లు మాజీ ముఖ్య మంత్రి దిగ్విజరుసింగ్, తాజా మాజీ కమల్నాథ్ పార్టీ వ్యూహాలకు నాయకత్వం వహిస్తు న్నారు. కమల్నాథ్ బీజేపీ హిందూత్వ ఎత్తులను కూడా వదలిపెట్టకుండా హనుమాన్భక్తి వంటి పాచికలు కూడా ప్రయోగిస్తున్నారు. ఇక రాజవంశీకుడైన జ్యోతి రాదిత్య మొదటిసారి శాసనసభకు పోటీ చేస్తుంటే కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రవేశం ఆశ్యర్య కరంగా మారింది. మధ్యలో కొద్ది మాసాలు మినహా పద్దెనిమిదేండ్ల నుంచి చౌహాన్ అధికారంలో వున్నారు గనక ప్రభుత్వ వ్యతిరేకత బాగా వుంది.గతంలో మోడీకి ప్రత్యామ్నాయంగా పరివార్ వర్గాలు మాట్టాడిన చౌహాన్ పేరు ఇప్పుడు ఆఖరి జాబితాలో గాని చూపిం చుకోలేకపోయారు. ముగ్గురు కేంద్ర మంత్రులు, ఏడుగురు ఎంపీలను కూడా బీజేపీ రంగంలోకి దిం పింది. చౌహాన్ తమ తదుపరి సీఎం అని బీజేపీ చెప్ప డం లేదుగాని ఆయన మాత్రం తాను ఫీనిక్స్పక్షిలా పైకి లేస్తానని ప్రకటిస్తున్నారు. మరోవైపు ఆయన ప్రభుత్వం 50శాతం కమీషన్ సర్కార్ అని కమల్నాథ్ దెప్పిపొడుస్తున్నారు. పట్వారీల నియామకం, మహా కాల్ లోక్నిర్మాణం, రేషన్ కార్డుల పంపిణీ వంటివి కుంభకోణాలు వున్నాయి. గతంలోని వ్యాపాం ఆరో పణలు వెంటాడుతూనే వున్నాయి. 70శాతం పైగా ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడిన ఈ రాష్ట్రంలో వర్షాభావం, గిట్టుబాటు ధరలు, దిగుబడి తగ్గుదల పెద్ద సవాళ్లుగానే వున్నాయి. రాష్ట్రంలో 47 గిరిజన స్థానాలున్నాయి. అంటే 20శాతం. 2018లో వీటిలో 31 కాంగ్రెస్నే గెలిపించాయి. తిరిగి అక్కడ పుంజుకో వాలని బీజేపీ తంటాలు పడుతున్నా ఈ మధ్య ఆది వాసిపై బీజేపీ నాయకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర నిరసనకు కారణమైంది. మధ్యప్రదేశ్, రాజ స్థాన్లలో కొత్తతరం నాయకులను సృష్టించు కోవడం కోసం ఇదంతా జరుగుతున్నదని ఆ పార్టీ చెబుతోంది. రాష్ట్రాల్లో బలమైన నాయకుల పట్టు తగ్గించి మోడీ నేరుగా నడిపించడమనే వ్యూహం కూడా ఇందులో వుంది.
చత్తీస్గఢ్
చత్తీస్గఢ్లో గతసారి ఎన్నికైన భూపేంద్రసింగ్ బహేల్ ప్రభుత్వం ఐదేండ్లు కొనసాగింది. బహేల్కు రైతుపక్షపాతి అనే పేరున్నా సమస్యలు కూడా చాలా వున్నాయి. మూడుసార్లు ఎన్నికైన రమణ్సింగ్ను ఓడించారనే పేరున్నా కాంగ్రెస్లో అంతర్గత సవాళ్లు తక్కువ కాదు. టిఎస్ సింగ్దేవ్ పార్టీలో మరో నాయ కుడుగా ముందుకొస్తున్నారు. హిందూత్వ తరహాను ఏదో మేరకు భూపేంద్ర వ్యూహాత్మకంగా అమలు చేసా ్తరనే విమర్శ కూడా వుంది. ఆయన ఒబిసి కావడం, చత్తీస్గఢ్ ఆత్మగౌరవ నినాదం కలసి వస్తాయని కాంగ్రెస్ ఆశిస్తున్నది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కూడా ప్రభావం చూపిస్తుంది. బీజేపీకి రమణ్సింగ్ ఏకైక ఆధారం కాగా హిందూత్వ మాత్రమే ప్రచారాయు ధంగా వుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అయితే చత్తీస్ గఢ్లో మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రా నిర్మాణం సాధ్య మనేది ఆ పార్టీ కీలక నినాదం.సర్వీస్ కమిషన్ అక్ర మాలపై ఆరోపణలు హైకోర్టు దాకా వెళ్లడం, లిక్కర్ స్కాం వంటి వాటిని బీజేపీ ప్రధానంగా ప్రచారంలో పెట్టింది. వరికి గిట్టుబాటు ధర విషయంలో వాగ్దాన భంగం, దక్షిణ బస్తర్ ఉత్తరాన సుర్గూజా ప్రాంతం బొగ్గుగనుల ప్రాంతం వంటి చోట్ల పర్యావరణం, గిరిజన సంక్షేమం, తీవ్రవాదం రాష్ట్రంలో కీలకాంశా లుగా వున్నాయి.
మిజోరం
మిజోరం జోరాంతంగ మిజో నేషనల్ ఫ్రంట్కు చెందిన వారు. పదిహేనేళ్ల విరామం తర్వాత 2018లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మాజీ ఉగ్రవాద నాయకుడు లాల్తంగా సన్నిహితుడైన జోరాం తంగకు మిజోజాతీయత గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మయన్మార్, బంగ్లాదేశ్ల నుంచి ఇటీవల మణిపూర్ నుంచి వచ్చిన శరణార్థుల సమస్యలను పరిష్కరించడం ఆయన విజయాలుగా చెప్పుకుంటారు. తనపైన వున్న అవినీతి కేసుల నుంచి స్థానిక కోర్టులలో బయిటపడ గలిగారు. ఈ అంశమే ఆయుధంగా దెబ్బతీయాలని ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూమెంట్(జెడ్పిఎం) నాయ కుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ఐపిఎస్ లాల్దుమోహ భావిస్తున్నారు. లాల్ తన్వాలా నాయ కత్వంలో కాంగ్రెస్ 1984 నుంచి 2013 వరకు వరస గా విజయాలు సాధించింది, మాజీ ఆర్థికమంత్రి లాల్ సవాలా ప్రస్తుతం కాంగ్రెస్కు నాయకత్వం వహిస్తున్నారు.
తెలంగాణ
తెలంగాణ ఎన్నికల్లో తామే వస్తామని బీజేపీ మొదట చాలా హడావుడి చేసిన బీజేపీ మునుగోడు దెబ్బ తర్వాత తోకముడిచింది. అప్పుడు దానిపై తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కెేసీఆర్ తర్వాత కాలంలో ఆ తీవ్రత తగ్గించడం, బీజేపీ ‘ఇండియా’కి సమదూరమని ప్రకటించడం రాజకీయ సందేహాలకు కారణమైంది. ఆయన కుమార్తె ఎంఎల్సి కవితపై ఢిల్లీ లిక్కర్ కేసులో నవంబర్ వరకూ ఊరట లభించింది. ఇప్పటికీ కేటీఆర్, హరీశ్రావు వంటివారు బీజేపీపై నిప్పులు కక్కుతున్నా ఆ సందేహాలు తొలగి పోవడం కష్టమే. ఈ మధ్యనే మోడీ సభల్లో కెేసీఆర్ ఒక దశలో ఎన్డిఎలోకి వస్తానని అనుమతి కోరితే తాను తిరస్కరించానని చెప్పారు. దాన్ని ఖండిస్తూ వారి నాయకుడు ఎంపీ లక్ష్మణ్ తమ దగ్గరకు వచ్చినట్టు కెేటీఆర్ చెప్పారు. మొత్తానికి తెరవెనక రాజకీయాలు చాలా నడిచినట్టు మాత్రం ప్రజలకు అర్థమైంది. ఏది ఏమైనా కాంగ్రెస్ రాకూడదని కోరుకుంటున్న బీజేపీ నేతలు మతపరమైన ప్రసంగాలు చేస్తూ ఉద్రిక్తత పెంచుతున్నారు. కొన్ని సర్వేల్లో కాంగ్రెస్కు అను కూలంగా వస్తున్నా పోటీ తీవ్రంగానే వుండ బోతున్నది. వామపక్షాలతో సీట్ల సర్దుబాటు చర్చల సంకేతాలు పంపిన కేసీఆర్ ఏకపక్షంగా అభ్యర్థుల జాబితా ప్రక టించి అది ముగిసిపోయిందని చెప్పడం విమర్శ లకు గురైంది. ప్రస్తుతం కాంగ్రెస్ వామపక్షాల మధ్య కొన్ని చర్చలు జరిగినా సీట్ల విషయం ఖరారుకాలేదు. కాంగ్రె స్కు సహజసిద్ధమైన అంతర్గత కలహాలు, సామాజిక వర్గాల అలకలు కొనసాగుతున్నాయి. తెలుగు వారుగా తెలంగాణ పరిస్థితి ఇంకోసారి మరింత వివరంగా మాట్లాడుకోవాల్సి వుంటుంది. అయితే ఇటీవల ఏపీ రాజకీయాల ప్రభావం తెలంగాణపై అధికంగా కని పిస్తున్నది. ఇక్కడి నాలుగు ప్రాంతీయ పార్టీలనూ గుప్పి ట్లో పెట్టుకున్న బీజేపీ చంద్రబాబు అరెస్టును అవ కాశంగా తీసుకుని టీడీపీని తన వలయంలో చేర్చుకు న్నది. ఏపీలో చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో మరీ ముఖ్యంగా ఐటి కారిడార్లో నిరసనలు అనుమతించ బోమని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నెమ్మదిగా ఇది కులం కోణం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ సామాజిక వర్గం ఓట్లు అండదండలు కాంగ్రెస్కే వుంటాయని కథనాలు రావడంతో బీఆర్ఎస్ కూడా వ్యూహం మార్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ మంత్రులు కూడా బాబుకు అనుకూలంగా ప్రకటనలు చేశారు.
తెలంగాణలో రాజకీయ ఆర్థిక సమస్యలు చాలా వున్నా కొన్నిశక్తులు ఉద్దేశపూర్వకంగా కుల మత విభజ నలే వ్యూహాలుగా ముందుకు తెస్తున్నాయి. హిందూత్వ రాజకీయానికి దూషణలు, దుర్భాషలు జోడించి రెచ్చి పోయిన బండి సంజరు స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని చేశాక కొత్త ఎత్తుగడలు మొదలెట్టారు. చంద్రబాబు అరెస్టుపై లోకేష్ను హౌం మంత్రి అమిత్షాతో కూర్చోబెట్టి ఇరువైపులా పురంధ రేశ్వరి కిషన్రెడ్డి వుండటం అందులో భాగమే. ఎన్డీయే లో చేరాలని ఉబలాటపడిన టీడీపీని రానివ్వని బీజేపీ ఇప్పుడు తన అవసరానికి ఇన్ని విన్యాసాలు చేస్తోంది.
సీపీఐ(ఎం) ఇప్పటికే స్పష్టం చేసినట్లు టీడీపీ కోరుకుంటే బీజేపీతో చేరవచ్చు గానీ మతతత్వం, ఏపీకి చేసిన అన్యాయం, రాష్ట్రాల హక్కులపై దాడి వంటి విషయాలను విస్మరించి కేంద్ర బీజేపీని తీర్పరిగా చేయడం పొరబాటవుతుంది. ఏపీలో తమ అవసరా లను బట్టి తెలంగాణలో బీజేపీకి మద్దతు ఆఫర్ చేయడం జనసేన, టీడీపీల వ్యూహంగా వుంది. ఏపీ, తెలంగాణల విభజన సమస్యలను పరిష్కరించకపోగా జటిలం చేసి ప్రయోజనం పొందాలనుకోడం బీజేపీ రాజకీయ కుటిలత్వం. బీజేపీ మతరాజకీయాలకు బొమ్మ బొరుసుగా మజ్లీస్ కూడా అక్కడ తన ప్రభావం చూపిస్తుంది గనక మరింత అప్రమత్తత అవసరం. తన సంక్షేమ పథకాలు, తెలంగాణ సెంటి మెంట్ గట్టెక్కి స్తుందని బీఆర్ఎస్ భావిస్తుండగా కర్నాటక తరహాలో ఇక్కడా గెలుస్తామని కాంగ్రెసు నమ్మకంగా వుంది. సర్వే లు ఏం చెప్పినా తెలంగాణ ఎన్నికల పోరాటం తీవ్రం గానే వుంటుంది. దక్షిణ భారతంలో బీజేపీ, దాని అను కూల శక్తులు కాలూనకుండా అడ్డుకోవడం కీలకమవుతుంది.
తెలకపల్లి రవి