
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించరు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ(ఎం) పార్టీని ప్రజలు ఆదరించి సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థులు పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలిపించేలా కార్యకర్తలు ఇప్పటినుంచి కృషి చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా అవకాశం ఉన్నచోట్ల సర్పంచ్ స్థానాల్లో, ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాల్లో సీపీఐ(ఎం) పోటీ ఉంటుందని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం ను ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లాలో పేద, మధ్యతరగతి ప్రజలకు, కార్మికులకు, రైతు కూలీలకు రైతులకు భూమి పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, యువతకు ఉపాధి కల్పించాలని అనేక సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించామని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం)ని గెలిపించాల్సిన అవసరం పేద మధ్యతరగతి ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, రైతాంగానికి ఉన్నదని అన్నారు. రానున్న ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో సీపీఐ(ఎం) పార్టీని గెలిపించడానికి కార్యకర్తలు సైతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మోతిరం నాయక్ , కొత్త నరసింహులు, జిల్లా కమిటీ సభ్యులు ముదం అరుణ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రేణుక తదితరులు పాల్గొన్నారు.